Covid-19: తెలంగాణలో కొత్తగా 836 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 836 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 38,122 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 836 మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,17,367కి చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువుగా ఉన్నాయి. హైదరాబాద్లో 443 కేసులు నమోదు కాగ, మేడ్చల్ మల్కాజ్గిరిలో 55, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 52 కొత్త కేసులు వెలుగు చూశాయి. వీటితో పాటు కరీంనగర్లో 35 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 765 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 8,08,270కి చేరింది. రికవరీ రేటు 98.89కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఏ ఒక్కరూ మరణించలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4111 వద్దే నిలిచింది.
కరోనా కేసులు చాపకింద నీరుగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. నిబంధనలు కఠిన తరం చేస్తోంది. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కోరింది. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.28.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/e7l8PE2QTz— IPRDepartment (@IPRTelangana) July 28, 2022