Commonwealth Games: భారత్కు మరో స్వర్ణం
Another Gold in Weightlifting: కామన్వెల్త్ గ్రేమ్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పథకాల సంఖ్య 6కు చేరింది. బెంగాల్కు చెందిన అచింత షూలి ఏకంగా 313 కేజీలు ఎత్తి భారత్కు మరో స్వర్ణాన్ని అందించాడు. లిఫ్టింగ్లో భారత్కు ఇది మూడో స్వర్ణం కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలో 137 కేజీల బరువు ఎత్తిన అచింత షూలి.. రెండో ప్రయత్నంలో 140 కేజీలు, మూడో ప్రయత్నంలో ఏకంగా 143 కేజీలు ఎత్తి రికార్డు సృష్టించాడు.
తన తొలి ప్రయత్నంలో 166 కేజీలు ఎత్తిన అచింత రెండో ప్రయత్నంలో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో అంతే బరువు ఎత్తి మొత్తంగా 313 కేజీలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన హిదాయత్ 303 కేజీలతో రజతం, కెనడాకు చెందిన షాద్ 298 కేజీలతో కాంస్యం గెలుచుకున్నారు. గతేడాది జరిగిన జూనియర్ ప్రపంచ వెయిట్లిఫ్టింగ్లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో 2019, 2021లో చాంపియన్గా నిలిచాడు.
బర్మింగ్హామ్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు ఆరు పతకాలు సాధించగా, అందులో మూడు స్వర్ణం.. రెండు రజతం, ఒక కాంస్యం లభించాయి. పాయింట్ల పట్టికలో భారత్ ఆరోస్థానంలో ఉండగా, 22 స్వర్ణాలు సహా 52 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 34, న్యూజిలాండ్ 19 రెండుమూడు స్థానాల్లో ఉన్నాయి.